8 March, 2026 | 3:37 PM

Breaking News

ఆన్‌లైన్ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రులు   •   ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •  

విమానం పక్కనే బస్సు దగ్ధం

29-10-2025 12:00 AM

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన

ఢిల్లీ, అక్టోబర్ 28: దేశ రాజధాని ఢిల్లీలో ని అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన ఓ బస్సు విమా నం పక్కనే దగ్ధమైంది. ఈ ఘటన విమానాశ్రయంలోని మూడో టర్మినల్ వద్ద జరిగింది. ట్యాక్సీయింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన విమానానికి అత్యంత సమీపంలో ఈ ప్రమా దం సంభవించింది. అయితే బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివే శారు. అలాగే బస్సు సమీపంలో ఉన్న విమా నం దెబ్బతినలేదని, అందులోని ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమా దం సంభవించిందని తెలుస్తోంది. ప్రమాదంపై ఎయిర్‌పోర్టు అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారులు ఇంకా స్పందించలేదు.