20-06-2025 02:16:22 PM
హుజురాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్.
హుజురాబాద్: (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఆర్టీసీ నుండి యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, భద్రకాళి ఆలయం కు ఈనెల 27న సూపర్ లగ్జరీ బస్సులు నడప నున్నట్లు డిపో మేనేజర్ రవీంద్రనాథ్ శుక్రవారం డిపోలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. దీనిని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హుజురాబాద్ బస్టాండ్ నుండి ఉదయం 4 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు హుజురాబాద్ కి చేరుకుంటుందన్నారు. సూపర్ లగ్జరీ బస్సుకు చార్జీలు పెద్దలకు ₹1000/ పిల్లలకు రూపాయలు 600/గా నిర్ణయించినట్లు, తెలిపారు. దైవదర్శనానికి వెళ్లే ప్రయాణికులకు అల్పాహారం, వాటర్ సదుపాయం ఆర్టీసీ కల్పించినట్లు తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్ కోసం క్రింది నెంబర్లను సంప్రదించి బుక్ చేసుకోవాలని కోరారు. 9959225924,9704833971,9247159535,9441404841. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.