calender_icon.png 20 June, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లట్టుపల్లిని గిరిజన మండలంగా ప్రకటించాలి

20-06-2025 02:13:11 PM

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) బిజినపల్లి మండలంలోని ఉమ్మడి లట్టుపల్లి గ్రామాన్ని గిరిజన మండల కేంద్రంగా ప్రకటించాలంటూ గ్రామస్థులు, గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. లట్టుపల్లి మండల సాధన సమితి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, వివిధ పార్టీల నేతలు, గిరిజన తండాల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లట్టుపల్లిని గిరిజన మండల కేంద్రంగా ప్రకటించాలన్న వినతిపత్రాన్ని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి అందించినట్లు తెలిపారు. మండలంలో గిరిజనుల సంఖ్య అధికంగా ఉండటం, ప్రత్యేకంగా 18 గిరిజన తండాలు లట్టుపల్లి పరిధిలో ఉండటం వలన, ఈ ప్రాంతాన్ని గిరిజన మండలంగా గుర్తించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.