2 September, 2026 | 9:29 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

మేడారంలో భక్తుల సందడి

13-07-2026 | 01:30am

మేడారం, జులై 12 (విజయక్రాంతి): మేడారంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వ్యవసాయ పనుల ప్రారంభం నేపథ్యం, విద్యా విద్యాలయాలు ప్రారంభమై నెలరోజులు కావస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తమ కుటుంబ సభ్యులతో సహా వనదేవతలను దర్శించుకోవడానికి మేడారం తరలివచ్చారు. సుమారు లక్షకు పైగా భక్తులు మనదేవతల సన్నిధికి చేరుకోవడంతో మేడారంలో భక్తుల కోలాహలం నెలకొంది. వనదేవతలకు భక్తులు ఎత్తు బంగా రం (బెల్లం), కొబ్బరికాయలు, చీరేసారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

చాలామంది భక్తులు తలనీలాలు సమర్పించారు. జంపన్న వాగులో ఉన్న కొద్దిపాటి నీటిలో పుణ్యస్నానం ఆచరించడంతో పాటు కొందరు ఉన్న ఒక్కగానొక్క నీటి షవర్ వద్ద స్నానాలు ఆచరించారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజు గద్దెలకు చేరుకొని చల్లగా చూడాలని వేడుకున్నారు. విపరీతమైన ఎండ నేపథ్యంలో గద్దెల పైన భక్తులకు ఎండ వేడి తాగకుండా వెదురు తడకలతో పందిరి ఏర్పాటు చేసినప్పటికీ గద్దెల ప్రాంగణంలో నీడ లేకపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాతి కట్టడాలతో గద్దె ల ప్రాంగణాన్ని పునరుద్ధరించడంతో ఎండ తీవ్రత నేపథ్యంలో భక్తులు అవస్థలు పడుతున్నారు.