04-12-2025 12:25:01 PM
హాజీపూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హాజీపూర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని మాధవరపు శ్రీలతకు కేటాయించిన బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వీరి వెంట బీ ఆర్ ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.