నిజామాబాద్ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీగా "మానస" ఏకగ్రీవ ఎన్నిక.
11-03-2026 09:28 PM
నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైన గొల్లపల్లి మానస రాజుగౌడ్. ఈ సందర్భంగా మనస మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన శాయశక్తుల కృషి చేస్తానని, ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.




