21-10-2025 06:34:38 PM
నకిరేకల్ (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని కోరుతూ మంగళవారం బోరబండ డివిజన్ లోని 314, 315, 316 బూత్ లలో మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సునీతను గెలిపించాలన్నారు. వారి వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.