6 June, 2026 | 5:44 PM

Breaking News

గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •   38 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   గండిపేట భూముల కబ్జా కేసు: బొల్లా బ్రహ్మనాయుడు కోర్టుకు తరలింపు   •   ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ ఆగ్రహం   •   ఇంటికో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి   •  

కారులో మంటలు.. అగ్నికి ఆహుతి

01-01-2026 11:36 AM

హైదరాబాద్:  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో(Abdullapurmet) గురువారం కారులో మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది. అధికారుల ప్రకారం, ఆ క్యాబ్ రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద ప్రయాణికులను దించి, డ్రైవర్ వాహనాన్ని బయట కేటాయించిన పార్కింగ్ స్థలంలో నిలిపాడు. డ్రైవర్ కారులోంచి బయటకు రాగానే వాహనంలో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు.హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నఅగ్నిమాపక వాహనం మంటలను ఆర్పివేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.