calender_icon.png 20 October, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీపుల్స్‌వార్ మిలిటెంట్లపై కేసు కొట్టివేత

20-10-2025 12:18:41 AM

  1. పీపుల్స్ వార్ నక్సల్స్, పోలీసుల మధ్య సిర్నాపల్లి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు

ధర్పల్లి పోలీస్ స్టేషన్‌లో 1998లో కేసు నమోదు

మొత్తం 77 మంది నక్సలైట్స్‌పై క్రిమినల్ కేసు

కొందరు నక్సలైట్లు ఎంకౌంటర్‌లో మృతి, మరికొందరి లొంగుబాటు 

మెయిన్ సెషన్స్ కేసు పలు విభాగాలుగా విభజించి విచారణ

ఆఖరికి మిగిలిన ఇద్దరు.. అరెస్ట్ 

నిజామాబాద్ అక్టోబర్ 19: (విజయక్రాంతి)పూర్వ సిపిఐ (ఎమ్. ఎల్)  పీపుల్స్ వార్ గ్రూప్ మాజీ మిలిటెంట్స్ బండ శీను, బొర్రన్న లపై ఇరవై ఏడు సంవత్సరాల క్రితం నమోదైనా క్రిమినల్ కేసును కొట్టివేస్తు నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ శుక్రవారం తీర్పు వెలువరించారు. 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పూర్వ భారత కమ్యూనిస్ట్ పార్టీ (ఎమ్. ఎల్ ) పీపుల్స్ వార్ గ్రూప్ సిర్నాపల్లి దళం ఆధ్వర్యంలో ఉత్తర తెలంగాణ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన 100 మంది నక్సలైట్స్ కు సిర్నాపల్లి అటవీ ప్రాంతంలో  దిశంబర్ 03,1998 న శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు ప్రత్రేక పోలీసు భద్రతా బాలగాలు చేరుకున్న విషయం తెలుసుకున్న నక్సల్స్ తుపాకులతో కాల్పులు జరపడంతో ప్రతీకగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపాయి.

ఇరువర్గాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. నగ్సల్స్ నుండి కాల్పులు ఆగిపోవడంతో, నగ్సల్స్ పారిపోయారని బావించిన పోలుసులు శిక్షణ ప్రాంతంలోకి వెల్లి చూడగా నగ్సల్స్ ఏర్పాటు చేసుకున్న అనేక టెంట్లు, వంట సామాగ్రి,పోతిరెడ్డి పల్లి అమరుల కిచెన్,గ్రంధాలయం, వైద్యాశాల, అని వ్రాసిన పేపర్స్,దినపత్రికలు, పుస్తకాలు లభించాయి. మరికొంత దూరంలో సెంట్రీ పోస్టులు, బకెట్ లో ఏర్పాటు చేసిన టెక్నాలజీ  క్లైమోర్ మ్రేన్స్, దుప్పటు, వాలిబాల్ కోర్ట్ కనబడినవని. ఇంకొంత దూరంలో  ఒక మహిళ నక్సలైట్ శవం ఉన్నట్లు గుర్చించారు. ఆమె కుడి వైపున 12 బోర్ తుపాకీ పడి ఉన్నది.

ఎదురు కాల్పుల ఘటనకు సంబందించి నాటి ధర్పల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మురళీధర్ పిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ నివేదికను రూపొందించారు.పూర్తి నేర విచారణ జరిపిన అనంతరం నాటి నిజామాబాద్ డివిజినల్ పోలీసు అధికారి ఎదురు కాల్పుల ఘటనలో లభించిన వస్తువులు, మృతి చెందిన మహిళ నగ్సలైట్ సావిత్రి  పోస్ట్ మార్టమ్ నివేదిక, సాక్షుల వాంగ్మూలాలు,

కొందరు ముద్దాయిల నేర అంగీకార పత్రాలు,నేరస్థల పంచానామా, ఫోరెన్సిక్ నివేదిక లను జత చేసి ప్రధాన ముద్దాయిగా గౌరారం తండా లంబాని రామ్ చందర్ ను పేర్కొంటూ మొత్తం 77 మంది నగ్సలైట్స్ పై అభియోగ పత్రాన్ని కోర్టులో దాఖలు చేశారు. కొందరు నగ్సలైట్స్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారని, కొందరు లొంగిపోతె అరెస్ట్ చేశామని,మరికొందరు తరువాత జరిగిన ఎంకౌంటర్ లో మరణించారని అభియోగ పత్రంలో తెలిపారు.

3 ఆగస్టు, 2001 న దివిజినల్ పోలీస్ అధికారి అభియోగ పత్రం అదారంగా ముద్దాయిలు అరెస్ట్ అయిన విదంగా ప్రధాన సెషన్స్ కేసును విభజించి సెషన్స్ కేసులకు నంబర్స్ కేటాయించి పలుమార్లు నేర న్యాయ విచారణ నిర్వహించిన కోర్టు ముద్దాయిలపై నేర ఆరోపణలు రుజువు కానందున కేసులను కొట్టివేశాయి. ఆఖరిగా ధర్పల్లి మండలం లింగపూర్ గ్రామానికి చెందిన బండ శీను, బొర్రన్న లపై కోర్టు బెయిలకు వీలులేని అరెస్ట్ వారంట్ ను 26 ఆగస్టు, 2016 న జారీ చేయడంతో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టిన అనంతరం కోర్టు ఆదేశాల మేరకు జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు.

వారికి నెల తరువాత కోర్టు బెయిలు మంజూరు చేసింది.ఈ కేసులో ముద్దాయిల అందరి తరపున మొదటి నుండి ప్రముఖ న్యాయవాది  ఆశ నారాయణ వాదించారు.ఈ కేసు విషయమై ముద్దాయిల తరపు న్యాయవాది తెలిపిన వివరాలుఇలా ఉన్నాయి.నేర న్యాయ విచారణలో భాగంగా సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన కోర్టు, ఇతర ధ్రువ పత్రాలు మార్క్ చేసి ముద్దాయిలపై నేర ఆరోపణలు రుజువు కానందున బండ శీను, బొర్రన్న లను నిర్దోషులుగా ప్రకటిస్తు, వారిపై నమోదైన కేసును కొట్టివేస్తు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ తీర్పు చెప్పారు.