12 March, 2026 | 6:51 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

జనగామ న్యాయవాదులపై కేసులు ఎత్తివేయాలి

08-08-2024 03:51 AM

విజయక్రాంతి నెట్‌వర్క్: జనగామకు చెందిన న్యాయవాద దంపతులు అమృతరావు, కవితపై పోలీసులు అకారణంగా దాడిచేసి, వారిపై అక్రమంగా కేసులు పెట్టారని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు  నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దంపతులపై కేసులు ఎత్తివేయాలని కోర్టుల్లో విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. వారిపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడులు సమాజానికి మంచికాదని, రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. నిరసనల్లో బార్ అసోషియేషన్ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.