12 June, 2026 | 8:09 PM

విద్యార్థులకు ప్రశంస పత్రాలు

12-06-2026 07:06 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఉపాసన వ్యాసరచన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గురువారం బహుమతులను అందజేశారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో మొత్తం 30 మంది విద్యార్థులకు ఈ బహుమతులను ప్రశంస పత్రాలు అందించారు. జిల్లా అటవీ శాఖ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబిడే పట్టాభి శాఖ అధికారి నాగిని భాను అధికారులు రామకృష్ణారావు ఎండి నజీర్ ఖాన్ విద్యార్థులు ఉన్నారు.