13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకా కార్యక్రమం ప్రారంభం

31-03-2026 12:47 AM

మరిపెడ, మార్చి 30 (విజయక్రాంతి): మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను అరికట్టే లక్ష్యంతో చేపట్టిన క్యాన్సర్ వైరస్ నిరోధక టీకా కార్యక్రమాన్ని మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ గుగు లోతు రవి ప్రారంభించి, మండలంలోని 13 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలందరూ ఈ ఉచిత టీకా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రైవేట్ ఆసుప త్రుల్లో వేల రూపాయలు ఖర్చయ్యే ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని తెలిపారు. ఈ వ్యాక్సిన్ భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రాకుండా సుమారు 90 శా తం వరకు రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. మండలంలోని తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు తప్పనిసరిగా ఈ టీకా వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ పూజిత, పీహెచ్‌ఎన్‌ఓ మంగమ్మ, హెల్త్ సూపర్వైజర్లు ఆచా ర్యులు, లక్ష్మికుమారి, ఏఎన్‌ఎంలు సరళ, శ్రీదేవి, స్టాఫ్ నర్స్ పద్మ తదితర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.