13-06-2025 08:33:30 PM
హనుమకొండ,(విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ కమిషనర్గా చాహత్ బాజ్పాయ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 2019 ఐఏఎస్ బ్యాచ్, ఐఐటి కాన్పూర్ లో ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల సబ్ కలెక్టర్గా పనిచేశారు. అనంతరం తెలంగాణ ఐఏఎస్ కాడకి వచ్చారు. గతంలో అదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. 2024 ఆగస్టు నుంచి కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేశారు. గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా పనిచేసిన డాక్టర్ అశ్విని తానాజీ వాకాడే కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ గా బదిలీ అయ్యారు. కష్టకాలంలో కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఆమె స్మార్ట్ సిటీ ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేయించారు.