28 August, 2026 | 2:09 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

డీడీఎన్ అర్చక సంఘం జిల్లా అధ్యక్షునిగా చక్రధరాచార్యులు

11-07-2026 04:41 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ దీప దూప నైవేద్య అర్చక సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా అనంతాద్రి దేవస్థాన ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబాబాద్ పట్టణంలోని అనంతాద్రి దేవస్థానంలో నిర్వహించిన జిల్లా డీడీఎన్ అర్చకుల సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న డీడీఎన్ అర్చకులు సమావేశానికి హాజరై వేతనాల సమస్యలు, దేవాలయాల అభివృద్ధి, అర్చకుల సంక్షేమం, ప్రభుత్వ పరంగా పరిష్కరించాల్సిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన గొడవర్తి చక్రధరాచార్యులు మాట్లాడుతూ, జిల్లాలోని డీడీఎన్ అర్చకులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి అర్చకుల సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం కొరకు కృషి చేస్తానని, ప్రతి అర్చకుడికి సంఘం అండగా ఉంటుందని పేర్కొన్నారు..నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ గొడవర్తి చక్రధరాచార్యులను సమావేశంలో పాల్గొన్న అర్చకులు, పలువురు ప్రముఖులు శాలువా కప్పి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.