జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి
28-08-2026 01:22 PM
జర్నలిస్టులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి
తరిగొప్పుల, (విజయక్రాంతి): రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తరిగొప్పుల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో స్థానిక ఎస్సై గుగులోత్ శ్రీదేవి జర్నలిస్టులకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీదేవి మాట్లాడుతూ.. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావడంలో వారు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. పోలీస్, మీడియా మధ్య స్నేహ సంబంధం, పరస్పర సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల సంక్షేమానికి, భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రింట్ జర్నలిస్టులు పాల్గొన్నారు.






