22-03-2025 12:00:00 AM
హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణకు ఏపీ సీఎం చంద్రబాబు మొదట్నుంచి అండగా ఉంటూ చిత్తశుద్ధితో కృషి చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ కొనియాడారు. ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం చారిత్రక విజయమన్నారు. ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబుదే కీలకపాత్ర అని చెప్పారు.
శుక్రవారం మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో న్యాయం ఉందనేందుకు ఏకగ్రీవ తీర్మానాలే నిదర్శనమన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా చంద్రబాబు న్యాయం వైపే నిలబడ్డారని చెప్పారు. 1996లో మహాసభకు వచ్చి ఎస్సీ వర్గీకరణకు తొలిసారి ఆయన హామీ ఇచ్చారన్నారు. 1997 తొలిసారి తీ ప్రవేశపెట్టిన ఘనత సైతం చంద్రబాబుదేనన్నారు.
1997లో చంద్రబాబు తల్లి ఆశీస్సులు తీసుకుని పాదయాత్ర ప్రారం తెలిపారు. ప్రస్తుతం ఏపీ అసెం ఎస్సీ వర్గీకరణకు ఏకగ్రీవ ఆమోదం లభించడం చంద్రబాబు చతురతే అన్నారు. వర్గీకరణ విషయంలో ఆయన సామాజిక న్యాయం చేశారని తెలిపారు. జగన్ అధికారంలో ఉంటే ఇది జరిగి ఉండేది కాదని, కనీసం వినతిపత్రం ఇచ్చేందుకూ తమకు అనుమతి ఇవ్వలేదని విమర్శించారు.
ఎస్సీ వర్గీకరణకు మోదీ, అమిత్షా, వెంకయ్యనాయుడు, కిషన్రెడ్డి అండగా నిలిచారని, పవన్ కూడా మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ విజయాన్ని 30 ఏండ్ల పోరాటంలో అమరులైన వారికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.