13-06-2025 08:15:14 PM
చండూరు,(విజయక్రాంతి): రైతు భరోసాను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని చండూరు మండల వ్యవసాయ అధికారి చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఈ సందర్భంగా చంద్రిక మాట్లాడుతూ... రైతు భరోసా పథకం వానాకాలం కొరకు 2025 లో కొత్తగా పట్టాలు పొందిన రైతులు జూన్ 20 వరకు రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా కు దరఖాస్తు చేసుకునే రైతులు పట్టాదారు పాసు బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంటు జిరాక్స్ డాక్యుమెంట్ ను రెవెన్యూ గ్రామల సంబంధిత ఏఈఓలకు ఇవ్వాలని ఆమె అన్నారు. గతంలో డబ్బులు వచ్చినవాళ్లు జిరాక్స్ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.