10-06-2025 01:15:38 AM
- టీచర్స్ ఎమ్మెల్సీ పింగళి
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): రాష్ర్టంలోని ఏపీపీఆర్ఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల పనివేళల మార్పునకు పీఆర్టీయూ టీఎస్ సంఘం అభ్యర్థన మేరకు ఉత్తర్వులు వెలువడనున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తెలిపారు.
సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు అజిత్ రెడ్డి, శ్రీనివాస్ను కలిసి గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ద్వారా తగు ఉత్తర్వులు విడుదల చేయనున్నట్లు వారు వెల్లడించారు. గురుకుల పాఠశాలల ఉ పాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు, హెల్త్ కార్డులు, నాన్-గెజి టెడ్ ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ఉమ్మడి డైరెక్టరేట్, తాత్కాలిక ఉద్యోగులకు 12 నెలల వేతనాలు తదితర సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నట్లు శ్రీపాల్ రెడ్డి తెలిపారు.