30 August, 2026 | 11:22 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

పరీక్షల పేరుతో అధిక ఫీజులు వసూలు

13-11-2024 04:55 PM

నారాయణఖేడ్ (విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజులను ప్రవేట్ పాఠశాల యజమాన్యాలు అధికంగా వసూలు చేస్తుందని సిపిఐ నాయకులు ఆనంద్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నారాయణఖేడ్ పరిధిలోని పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుండి అధికంగా ఫీజులు వసూలుకు పాల్పడటం అన్యాయం అన్నారు. పదో తరగతి పరీక్ష ఫీజు ప్రభుత్వపరంగా రూ.125 ఉండగా విద్యార్థుల నుండి 2500 వరకు అధిక ఫీజులు వసూలు చేసిన యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయన విద్యాశాఖ అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిరంజీవి, పుప్పల అశోక్ పాల్గొన్నారు.