04-06-2025 12:26:35 AM
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
- భూ సమస్యల పరిష్కారించడానికే “భూ భారతిచట్టం”
- ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని అధికారులు సక్రమంగా అమలు చేయలి
- కళ్యాణలక్ష్మీ, షాదీముబాకర్ నిరుపేదలకు వర్గం: ఎమ్మెల్యే
అబ్దుల్లాపూర్మెట్, జూన్ 03: భూ భారతితో భూ సమస్యలకు చెక్ పడుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో రైతు నివేదిక అవరణంలో రెవెన్యూ సద స్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరై.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ భారతితో భూ సమస్యలకు చెక్ పడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తి తంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం “భూభారతిచట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. చట్టాన్ని అధికారులు సక్రమంగా అమలు చేయాలని సూచించారు.
భూ హక్కులు కలిగి ఉన్న వారికి ఈ చట్టం ద్వారా తగు న్యాయం జరుగుతుందన్నారు. గత పాలకులు అసైన్డ్, వక్స్బోర్డు, సీలింగ్, భూ దాన్, ఎండోమెంట్ భూములను కొల్లకొట్టారన్నారు. ఆ భూ ములను ప్రభుత్వం వెనక్కి తీసుకొని పేదలకు పంచుతామని తెలిపారు. ఈ ప్రాంతంలో వందలకోట్ల విలువ చేసే.. వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమార్కులు అక్రమం గా ఆక్రమించుకున్నారని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్ర భుత్వ హయాంలో కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నారు.
కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ నిరుపేదలకు వర్గంలాంటిదని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగా రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ, అబ్దుల్లాపూర్మెట్ మండలానికి సంబంధించిన 236 మంది లబ్దిదారులకు. రూ.2.36,37,376ల కళ్యాణలక్ష్మీ, షాదీముబాకర్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థా నిక తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, సిబ్బంది, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.