calender_icon.png 7 June, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువు ఏ ఒక్కరి సొత్తుకాదు!

04-06-2025 12:27:10 AM

  1. అంతర్జాతీయస్థాయిలో మన విద్యార్థులు ఎదగాలి
  2. గురుకులాల్లో జ్యోతిబాఫూలే సినిమా ప్రదర్శిస్తాం
  3. పదోతరగతి విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలు అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): చదువు ఏ ఒక్కరి సొత్తుకాదని, అది అందరి సొత్తు అని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహాత్మా జ్యోతిబాఫూలేను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. పదో తరగతి ఫలితాల్లో మంచిమార్కులు సాధించిన మహాత్మా జ్యో తిబాఫూలే గురుకులాలకు చెందిన విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలను ఆయన అం దించారు.

బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅ తిథిగా హాజరై మాట్లాడారు.. విద్యార్థులు పా స్ మాత్రమే కాకుండా మంచి మార్కులు వచ్చేలా అధ్యాపకులు కృషిచేయాలని సూ చించారు. మొత్తం 17 వేలమంది విద్యార్థు లు పదోతరగతి పరీక్షలు రాస్తే అందులో వందల్లో విద్యార్థులకు 570కి పైగా మా ర్కు లు వచ్చాయన్నారు. ట్రెక్కింగ్, సెయిలిం గ్ పోటీల్లో పాల్గొనేలా విద్యార్థులకు శిక్షణ అం దిస్తున్నామని చెప్పారు.

జ్యోతిబాఫూలే సినిమాను అన్ని గురుకులాల్లో తల్లిదండ్రులతో సహా విద్యార్థులకు చూపెడతామన్నా రు. రేపటి తెలంగాణ భవిష్యత్తుకు మీరే మా ర్గదర్శకులు కావాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధ ర్, కమిషనర్ బాలమాయాదేవి, గురుకుల సెక్రటరీ బీ సైదులు, బీసీ సంక్షేమశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదిత రులు పాల్గొన్నారు.