16 April, 2026 | 10:09 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

08-11-2025 08:49 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని శనివారం అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య ఆధ్వర్యంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిక్షమయ్య మాట్లాడుతూ, గ్రామీణ స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ ముఖ్యమంత్రి స్థాయికి చేరిన రేవంత్ రెడ్డి గారు సామాన్య ప్రజల కష్టసుఖాలను బాగా అర్థం చేసుకున్న నాయకుడు.

అందుకే రాష్ట్రంలోని అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు అని తెలిపారు. అలాగే నిత్యం ప్రజల కోసం శ్రమించే రేవంత్ రెడ్డి గారు నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, వచ్చే 15 సంవత్సరాలు అధికారంలో కొనసాగి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. అంతకుముందు సాయిబాబా దేవాలయంలో బిక్షమయ్య నేతృత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ముఖ్యమంత్రికి దీర్ఘాయుష్షు కోరుతూ ప్రార్థనలు చేశారు.