9 May, 2026 | 10:31 AM

Breaking News

నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •   రైతులకు మద్దతు ఏదీ?   •  

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు

03-12-2025 08:08 PM

దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నాయకులు

మేడిపల్లి (విజయక్రాంతి): హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. మంగళవారం గాంధీ భవన్లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హిందువులకు మూడు కోట్ల మంది దేవుళ్లు ఉన్నారని ప్రశ్నించారు. మనకు దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు పలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ వ్యాఖ్యలను నిరసనగా యువ మోర్చా ఆందోళనకు పిలుపునిచ్చింది.

దీంతో మల్కాజ్గిరి నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో మేడిపల్లిలో వరంగల్ జాతీయ రహదారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగ జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పవన్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.