26 May, 2026 | 12:59 PM

Breaking News

సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •   మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు   •  

స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్యమిత్రులు

01-04-2026 12:10 AM

గరిడేపల్లి, మార్చి 31 : ఆటలు ఆడుకున్నాం.. కలిసి చదువుకున్నాం.. ఆటలే కాదు కష్టంలో కూడా స్నేహితుడి కుటుంబానికి అండగా ఉంటాం అని నిరూపించారు తోటి స్నేహితులు. గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన తోటి స్నేహితుడు పిట్ట శ్రీను ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. స్నేహితుడు కుటుంబం బీద స్థితిలో ఉండటంతో ఆపదలో ఉన్న వారి కుటుంబానికి నాటి స్నేహితులు కొందరు అండగా నిలిచారు.

తనతో 1998 - 99 మండల కేంద్రమైన గరిడేపల్లి లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి బ్యాచ్ కి చెందిన స్నేహితుడు కుటుంబానికి అండగా నిలిచిన తోటి స్నేహితులు 24 వేల రూపాయలు మృతి చెందిన స్నేహితుడు భార్యకు మంగళవారం అందజేశారు.మృతి చెందిన స్నేహితుడు కుటుంబానికి అండగా నిలిచిన తోటి స్నేహితుల ఔదార్యాన్ని పలువురు అభినందించారు.ఆర్థిక సాయం అందజేసిన వారిలో  టిడిపి పార్టీ మండల అధ్యక్షుడు కీసరి నాగయ్య,మాచర్ల వెంకటేశ్వర్లు, కానుగు సోమయ్య,పెండెం పెద్ద రాంబాబు,కర్నాటి కవిత, కుక్కునూరు సుజాత తదితరులు ఉన్నారు