calender_icon.png 23 June, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

23-06-2025 04:44:56 PM

యంగ్ స్టార్ యూత్ అధ్యక్షులు షేక్ షకీల్..

ఖానాపూర్ (విజయక్రాంతి): జిల్లాలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని, ఇందుకోసం ఆదేశాలు జారీ చేయాలని ఖానాపూర్ యంగ్ స్టార్ యూత్ అధ్యక్షులు షేక్ షకీల్(Young Star Youth President Sheikh Shakeel), కార్యదర్శి అల్హజ్ కోరారు. ఈ మేరకు సోమవారం నిర్మల్ జిల్లా ప్రజావాణిలో కలెక్టర్కు విజ్ఞాపన పత్రం అందజేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివితే ప్రభుత్వం నుంచి కనీస మౌలిక సదుపాయాలు పాఠశాలలో ఏర్పాటు చేస్తారని, దాంట్లో బీద కుటుంబాల పిల్లలు కూడా మంచిగా చదువుకునే అవకాశం ఉంటుందని, కనీస వసతులు లేక పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకుంటున్న వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు వెనకాడుతున్నారని, ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేసినట్లు వారు తెలిపారు.