29-06-2025 05:25:00 PM
చిలుకూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినెల నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో చిలుకూరు మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు. చిలుకూరు మండలం రామాపురం గ్రామంలో మునుగంటి, నాగాచారి, అధ్యక్షతన వారి నివాసంలో మన్ కి బాత్ కా ర్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కొండా, శ్రీను, మన్ కీ బాత్ కన్వీనర్ కొడారు, రాము. సుంకర, లింగారెడ్డి, మట్టయ్య, కాశీనాధం, బూర, రమణ, నరేష్, జల్లా, జనార్ధన్, ఎల్లయ్య, మట్ట, నరసింహారెడ్డి, శ్రీధర్, పరిపూర్ణాచారి, పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి పలు అంశాలను ప్రస్తావించారని అన్నారు.
భారతదేశాన్ని ట్రకో మా ( కంటి వ్యాధి ) నుండి విముక్తి పొందిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని ప్రధాని పేర్కొన్నారని అన్నారు. ఇది దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు సాధించిన విజయమని, జల్ జీవన్ మిషన్ కిందికి దోహదపడుతుందని ప్రధాని వివరించారని. జూన్ 21న, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు, దివ్యాంగులు పాల్గొనడం విశేషమని అన్నారని, యోగా ఎంత శక్తివంతమైన సాధనంగా ఉంటుందో వారు చూపించారని, ఢిల్లీ ప్రజలు నది ఒడ్డున యోగా చేశారని, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఫినాప్ వద్ద కూడా యువ కార్యక్రమాలు జరిగాయని, న్యూయార్క్ లండన్ టోక్యో పారిస్ తదితర ప్రాంతంలో యోగ వేరుకులు జరిగాయని ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలోఅన్నారు.