13-06-2025 02:20:01 AM
తన సొంత వాహనాన్ని బడిబాట విద్యా వాహిని ప్రచార రథంగా మార్చిన ఎమ్మెల్యే
చొప్పదండి, జూన్12(విజయక్రాంతి):చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తన సొంత వాహనాన్ని బడిబాట విద్యా వాహిని వాహనంగా మా ర్చాలని నిర్ణయించారు. తన ఆలోచనను ఆచరణలోకి తీసుకువచ్చి తన సొంత వాహనాన్ని విద్యా వాహిని వాహనంగా మార్చి బడిబాట ప్రచార కార్యక్రమంలో ఉపయోగించేలా చేశారు.
గురువారం గంగాధర మండలం మల్లాపూర్ లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో వాహనాన్ని విద్యాశాఖ అధికారులకు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎవ్వరు చేయని విధంగా ఆలోచన చేసే, తన సొంత వాహనాన్ని విద్యా వాహిని కి అందజేసి తన గొప్పదనాన్ని చాటుకున్నారు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యను అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్ర భుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
గతంలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి, ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులను మళ్లించే విధంగా కుట్రలు జరిగాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం లో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నట్టు, పాఠశాలల్లో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తామని తెలిపారు.
ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడం పనిచేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్ రావు, స్కూల్ హెచ్ఎం అంజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమల్ రావు, పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్,
నాయకులు దుబ్బాసి బుచ్చన్న,పడితపల్లి కిషన్,కోల ప్రభాకర్,కొలిపాక స్వామి, సీనియర్ నాయకులు సత్తు కనకయ్య, గంగాధర సుదర్శన్ ,గునుకొండ బాబు, వేముల అంజి, కంకణాల రాజగోపాల్ రెడ్డి, గుజ్జుల బాపురెడ్డి, కర్ర బాపురెడ్డి,గరిగంటి కరుణాకర్, మంత్రి మహేందర్, పెంచాల చందు,పానుగంటి సత్యం, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులుపాల్గొన్నారు.