9 April, 2026 | 4:12 AM

ఫిబ్రవరి 12నుంచి సీఐఎస్‌సీఈ పరీక్షలు

15-11-2025 01:30 AM

న్యూఢిల్లీ, నవంబర్ 14 : కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎక్జామినేషన్ (సీఐఎస్‌సీఈ) బోర్డు పరీక్షలు వచ్చే ఫిబ్రవరి 12నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి  ఏప్రిల్ 6 వరకు 12వ తరగతి, ఫిబ్రవరి 17 నుంచి మార్చి 30 వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతాయి. 2.6లక్షల మంది విద్యార్థులు సీఐఎస్‌సీఈ(10వ తరగతి), 1.5లక్షల మంది విద్యార్థులు సీఐఎస్‌సీఈ (12వ తరగతి) పరీక్షలు హాజరవుతారు.