కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చలిమంటల యుద్ధం
16-12-2025 09:58 AM
చలిమంటల కర్రలతో దాడులు
హైదరాబాద్: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువుకొమ్మ తండాలో(Cheruvukommu Thanda) ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. చలిమంటలు వేసుకున్న సమయంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వివాదం జరిగింది. సర్పంచ్ గెలుపు విషయమై పరస్పరం చలి మంటల కర్రలతో దాడులు చేసుకున్నారు. సర్పంచ్ గెలుపు(Sarpanch victory) విషయమై కర్రలతో కొట్టుకున్నారు. రెండు పార్టీల కార్యకర్తలకు స్పల్పగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




