01-06-2025 12:00:00 AM
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై చర్చ
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ జూన్ 4వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచా రం. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ తో పాటు పీసీసీ కార్యవర్గంపై పార్టీ హైకమాండ్తో కీలక భేటీ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలుసార్లు ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్రెడ్డి చర్చలు జరిపేందుకు హస్తినకు వెళ్లివచ్చారు.
౨ రోజుల క్రి తం రాహుల్గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ భేటీ అయి.. తెలంగాణ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం, పీసీసీ చీఫ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 30న ఢిల్లీకి వెళ్లాల్సి ఉండ గా.. హైకమాండ్ అపాయింట్మెం ట్ లభించకపోవటంతో పర్యటన వాయిదా పడినట్టు సమాచారం.
గత ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ ప్ర ధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో మరిన్ని చర్చలు, సమావేశాల కోసం సోమవారం వారిని ఢిల్లీలోనే ఉండమని కోరారు.
కానీ వారి అపాయింట్మెంట్ లభించకపోవడంతో హైదరాబాద్కు తిరిగొచ్చారు. సీఎం, పీసీసీ చీఫ్ శుక్రవారం ఢిల్లీకి రావాలని ఏఐసీసీ మళ్లీ పిలుపునందించగా.. మల్లికార్జున్ ఖర్గే అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడం వల్లే రేవంత్రెడ్డి, మహేశ్కుమార్ ఢిల్లీ వెళ్లలేదని తెలిసింది.