calender_icon.png 2 June, 2025 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొవిడ్ భయం!

01-06-2025 01:07:08 AM

  1. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో విజృంభిస్తోన్న వైరస్ 
  2. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,395 
  3. శనివారం ఒక్కరోజే 685 కేసులు నమోదు 
  4. తెలంగాణలో మూడు.. ఏపీలో 17కు పెరిగిన కేసులు 
  5. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన కేంద్ర ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ, మే 31: భారత్‌లో కొవిడ్-19 మళ్లీ భయం కలిగిస్తోంది. దేశంలో 3,395 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్టు శనివా రం కేంద్ర ఆరోగ్య శాఖ లేఖను విడుదల చేసింది. అయితే శనివారం ఒక్కరోజే 685 కేసులు నమోదవ్వడం కాస్త ఆందోళన కలిగించే అంశం. గత 24 గంటల్లో కొవిడ్‌తో నలుగురు మృతి చెందగా.. ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళలో మరణాలు నమోదయ్యాయి.

2025, జనవరి 1 నుంచి ఇప్పటివరకు కొవిడ్-19తో మరణించిన వారి సంఖ్య 26గా ఉంది. మే 2౮ నాటికి 1,010 కేసులు మాత్రమే ఉన్నట్టు ఆరోగ్య శాఖ తెలుపగా, కేవలం ఐదు రోజుల్లోనే కేసుల సంఖ్య మూడురెట్లు అవ్వడాన్ని చూస్తే  కొవిడ్ విస్తరణ ఎంత వేగంగా ఉం దో అర్థం చేసుకోవచ్చు. కరోనా నుంచి కో లుకొని ఇప్పటివరకు 1,435 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయినట్టు ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.

ఆ ఎనిమిది రాష్ట్రాల్లోనే ఎక్కువగా..

కొవిడ్ కేసుల సంఖ్య మూడు వేలు దాటినప్పటికీ దేశంలో ప్రధానంగా ఎనిమిది రాష్ట్రాల్లోనే ఎక్కువ ప్రభావం ఉంద ని కేంద్రం తెలిపింది. కేరళ, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కేరళలో ఇప్పటివరకు 1336 కేసులు నమోదవ్వగా.. మహారాష్ట్ర (467), ఢిల్లీ (375) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇక మిగిలిన రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య కనీసం వంద దాటడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో మూడు యాక్టివ్ కేసులు నమోదవ్వగా.. ఆంధ్రప్రదేశ్‌లో కేసుల సంఖ్య 17కు చేరుకుంది.  దక్షిణాదితో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య ఉత్తరాదిలోనే ఎక్కువగా ఉంది.

రాజస్థాన్ (51), ఉత్తర్ ప్రదేశ్ (42) పుదుచ్చేరి (25), హర్యానా (20), మధ్య ప్రదేశ్ (10) కేసులు ఉండగా.. గోవాలో 7, ఒడిశా, పంజాబ్, జమ్మూలో నాలుగు చొప్పున ఉన్నాయి. ఇక సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ సహా అండమాన్ అండ్ నికోబార్‌లో ఇప్పటిరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

ఆందోళన అవసరం లేదు

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సహ వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. భారత్‌లో అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం జె.ఎన్ 1 వేరియంట్ కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. జెఎన్ 1 వేరియంట్‌లోనూ దగ్గు, జలుబు, తలనొప్పి, సహా జ్వరం లక్షణాలు కనిపిస్తాయని తెలిపింది.

కేంద్ర మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ మాట్లాడుతూ.. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తు న్నామని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేసులు  ఎక్కువగా నమోదవుతున్న 8 రాష్ట్రాల్లో ఇప్పటికే తగినన్ని ఐసోలేషన్ బెడ్స్, ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.