01-06-2025 12:00:00 AM
ఆపరేషన్ సిందూర్ సమయంలో మరణించిన పాకిస్థానీయులకు తెలిపిన సంతాపం వెనక్కి
న్యూఢిల్లీ, మే 31: కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ విజయం సాధించారు. శశిథరూర్ నేతృత్వంలోని ఎంపీల బృందం కొలంబియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ సమయంలో చనిపోయి న పాకిస్థానీయులకు సంతాపం ప్రకటించిన కొలంబియాకు థరూర్ నిజాలు వివరించారు. దీంతో కొలంబియా తన ప్రకటనను వెనక్కి తీసుకుంది.
ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రి రోసా యెలాండ్ విల్లావిసెన్సి యో తమ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్న ట్టు ప్రకటించారు. భారత బృందం తమకు నిజాలు తెలియజేసిందని, అవగాహన వ చ్చిందని ఆయన పేర్కొన్నారు. కొలంబియా కు వెళ్లిన థరూర్ ఆ దేశం పాక్ ఉగ్రవాదుల మరణానికి సంతాపం తెలపడంపై అసహ నం వ్యక్తం చేశారు.