6 July, 2026 | 9:19 PM

Breaking News

మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •  

సీఎం కప్ క్రీడలు ప్రారంభం

17-01-2026 09:26 PM

కుభీర్,విజయక్రాంతి): కుభీర్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ లో శనివారం సీఎం కప్ క్లస్టర్ స్థాయి 2వ అడిషన్ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడల పోటీలను ఎంపీడీఓ గంగా సాగర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోనూ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి విద్యార్థులు ముందుండాలని పేర్కొన్నారు.

క్రీడలు శారీరక దారుఢ్యానికి, మానసిక ఆరోగ్య పరిరక్షణకు అవి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడలు నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని దీంతో శరీర సౌష్టవం పెంపొందుతుందని సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని ఓటమిని పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ విజయ్ కుమార్, పాఠశాల హెచ్ఎం సట్ల గంగాధర్, ఎస్సై కృష్ణారెడ్డి, పీడి క్రాంతి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.