సిఎం సహాయ నిధి పేదలకు వరం
10-04-2026 01:34 PM
మఠంపల్లి ఏప్రిల్ 10(విజయ క్రాంతి): పేదలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరమని మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామ సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు అన్నారు.ఈ సందర్భంగా ఆయన వివిధ అనారోగ్య కారణాల వలన చికిత్స పొందిన ఏడుగురు లబ్దిదారులకు రూ.3.39 లక్షలు విలువ చేసే చెక్కులను హుజూర్ నగర్ లోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. ప్రమాదాలతో పాటు అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా వారిని మంత్రి ఉత్తమ్ సహకారంతో ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డ్ సభ్యులు టి.శ్రీనివాస్,నాగేంద్ర, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




