08-06-2025 10:15:46 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్(61) మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈనెల 5వ తేదీన గోపీనాథ్ ఇంట్లో ఉండగా గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చించారు.
కార్డియాక్ అరెస్టుకు గురైందని, సీపీఆర్ చేయడంతో తిరిగి కొట్టుకోని నాడి, బీపీ సాధారణ స్థితికి వచ్చాయి. దీంతోపాటు గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన మూడు నెలలుగా ఏఐజీ ఆసుపత్రిలోని ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. అప్పట్లో డయాలసిస్ చేయించినట్లు సమాచారం. తాజాగా గుండెపోటు రావడంతో ఆయన చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.