17-06-2025 12:55:05 AM
ముషీరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం అత్యం త ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్ద ర్ తెలుగు సినీ అవార్డుల ప్రధాన మహోత్సవ జ్ఞాపికను రూపొందించిన ప్రముఖ కళాకారుడు రామ్ నా యక్ను అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సినిమాటోగ్రాఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దిల్ రాజు చేతుల మీదుగా సన్మానం అం దుకున్నారు.
రామ్ నాయక్ రూపొందించిన జ్ఞాపికను ప్రత్యేకంగా అభి నందించారు. రామ్ నాయక్ అనేక అంతర్జాతీయ వేదికల మీద తెలంగాణ కళారంగాన్ని తన ఆర్ట్ ద్వారా యావత్ ప్రపంచానికి తెలియజేశారని, అమెరికా, లండన్, కెనడా, దు బాయిలో అనేక అంతర్జాతీయ వేదికల మీద తను గీసిన బొమ్మలు కో ట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేసాయన్నారు. ప్రపంచ పర్యావరణ సంస్థ సభ్యుడు గా ఉండి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అంతర్జాతీయ ప ర్యావరణవేత్త అధ్యక్షులు భద్ర సూచ న సలహాలు పాటిస్తూ ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేసుకున్నారు.