12-09-2024 11:07:35 AM
హైదరాబాద్: ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కోనసాగుతోంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. నేడు ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చి, కేంద్రాన్ని రేవంత్ రెడ్డి సాయం కోరే అవకాశముంది. మరోవైపు ఢిల్లీలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ను రేవంత్ రెడ్డి కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో సీఎం రేవంత్ చర్చించే అవకాశముంది.