calender_icon.png 22 October, 2024 | 9:14 PM

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ. 25లక్షల చెక్కును అందించిన సీఎం

10-07-2024 07:30:54 PM

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కరికి రూ.25లక్షల చెక్కును అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్ సోంలాల్ చెక్కులను అందుకున్నారు. ఒక్కొక్కరికి రూ.25లక్షల చెక్కులను అందించిన సందర్బంగా  పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు,