1 June, 2026 | 2:17 PM

Breaking News

బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ తహసిల్దార్..   •   డాక్టర్ కళ్యాణికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు సన్మానం   •   విచారణకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి   •   నెల చివరి వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు   •   రామంతాపూర్‌లో RTC బస్సును ఢీకొట్టిన కారు   •   పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ   •   ఆయిల్ పామ్ నర్సరీలో నాణ్యమైన మొక్కలు సిద్ధం చేయాలి   •   అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క   •   BRS నేతల ముందస్తు అరెస్టులు.. అప్రజాస్వామికం   •   సీఎం జనజాతర సభకు మార్లవాయి గ్రామస్తుల భారీ తరలింపు   •  

వర్షాకాలం సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

01-06-2026 01:26 PM

హైదరాబాద్: వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో వ్యవసాయ, నీటి పారుదల, పట్టణాభివృద్ది, పంచాయతీ రాజ్, ఆరోగ్య, హోమ్, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు. వాతావరణ శాఖ అధికారులు నైరుతి రుతుపవనాలతో వచ్చే వర్షపాతం, ఎల్ నినో ప్రభావం, ఇతర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

సాగునీటి ప్రాజెక్టుల(Irrigation Projects) మెయింటెనెన్స్ పనులపై సీఎం ఆరా తీశారు. గేట్లు, నిర్వహణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కు అవసరమైన నిధులు విడుదల  చేయాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు, కూలిన వంతెనల నిర్మాణానికి తక్షణమే నిధులు ఇవ్వాలని సూచించారు. విపత్తుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం,  పశు నష్టం జరిగితే వెంటనే స్పందించాలని ఆదేశించారు.