ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్
17-06-2026 09:15 AM
ఆరుట్ల: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో బుధవారం నాడు తెలంగాణ పబ్లిక్ స్కూలు(elangana Public School) ప్రారంభం అయింది. రూ. 15 కోట్లతో నిర్మించిన టీపీఎస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Government of Telangana State) ఆరుట్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలను నిర్మించింది. స్కూల్ డిజిటల్ క్లాస్ రూమ్స్(School Digital Classrooms), లైబ్రరీ, ల్యాబ్స్, మైదానం ఏర్పాటు చేశారు. విద్యార్థులతో కలిసి సీఎం బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఆరుట్లలో 11 గంటలకు బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఆరుట్ల పాఠశాల నిర్మించింది. రాష్ట్ర విద్యావ్యవస్థలో మార్పునకు నాందిపడిందని విద్యాశాఖ వెల్లడించింది.






