17 June, 2026 | 10:53 AM

Breaking News

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •   హామీలు నెరవేర్చకుంటే తిరుగుబాటు తప్పదు   •  

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు

17-06-2026 09:26 AM

మంథని,జూన్17(విజయ క్రాంతి): మంథని నియోజకవర్గంలోని మహాముత్తారం మండలం జీలపల్లి(పర్లపల్లి) గ్రామానికి చెందిన పెండెల పవన్ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని మొతినగర్ సన్‌రిడ్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు మంగళవారం ఆసుపత్రికి వెళ్లి పవన్‌ను పరామర్శించారు.

ఈ సందర్భంగా  శ్రీనుబాబు పవన్ యొక్క ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్స గురించి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పవన్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం, పవన్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని పవన్ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో  పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.