అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు
మంథని,జూన్17(విజయ క్రాంతి): మంథని నియోజకవర్గంలోని మహాముత్తారం మండలం జీలపల్లి(పర్లపల్లి) గ్రామానికి చెందిన పెండెల పవన్ అనారోగ్యంతో హైదరాబాద్లోని మొతినగర్ సన్రిడ్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు మంగళవారం ఆసుపత్రికి వెళ్లి పవన్ను పరామర్శించారు.
ఈ సందర్భంగా శ్రీనుబాబు పవన్ యొక్క ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్స గురించి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పవన్కు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం, పవన్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని పవన్ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






