01-10-2025 10:53:25 PM
కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు..
ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): దసరా ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గ్రామమైన నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో గురువారం కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి దసరా ఉత్సవాల్లో పాల్గొనున్నారు. అందుకు అధికార యంత్రాంగం భద్రత ఏర్పాట్లను సిద్ధం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఎన్నికల నియమావళికి లోబడి అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.
జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కృష్ణారెడ్డిలు ఏర్పాట్లను పరిశీలించారు. మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గ్రామానికి రెండోసారి ముఖ్యమంత్రి హోదాలో హాజరుకానున్న నేపథ్యంలో అందుకు తగినట్లు అధికార యంత్రాంగం భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా కలిసి ఆలయం వద్ద జమ్మి చెట్టు ప్రత్యేక పూజలు అనంతరం దసరా శుభాకాంక్షలు తెలపనున్నారు.