27 June, 2026 | 7:26 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

సీఎం రేవంత్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

04-08-2024 03:26 AM

టీఎస్‌టీసీఈఏ డిమాండ్

హైదారబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): ప్రైవేట్ టీచర్లపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో అర్హతలేని ఉపాధ్యాయులున్నారని సాక్షాత్తు సీఎం చెప్పడం బాధాకరమని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 33 లక్షల మంది విద్యార్థులకు చదువు చెప్తున్న టీచర్ల పట్ల అంత దారుణంగా మాట్లాడటం సమంజసం కాదని పేర్కొన్నారు.