14 July, 2026 | 4:48 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను అర్ధాంతరంగా ఆపేశారు

12-09-2024 02:13 AM
  1. వాల్మీకి స్కామ్‌తో రూ.187 కోట్లు దారి మళ్లింపు 
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో అమలైన సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను అర్ధాంతరంగా  ఆపేసి, ఇదే పథకాన్ని మొదలుపెట్టాలని కేంద్రానికి మొరపెట్టుకోవడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ర్టంలోని సుమారు 28 వేల పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థుల పొట్టగొట్టారని బుధవారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.  చిన్నారులకు నాణ్యమైన విద్యతోపాటు.. పౌష్ఠికాహారాన్ని అందించాలన్న ఆలోచన ఈ పథకం వెనక దాగి ఉందనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. వాల్మికీ స్కామ్ డబ్బులనే కాంగ్రెస్ లీడర్లు మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో వాడారని కేటీఆర్ ఆరోపించారు.

ఈ కుంభకోణంలో కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి బీ నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన చార్జిషీట్‌లో నిర్ధారించిందన్నారు. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’కు చెందిన రూ.187 కోట్లు ఏకంగా కాంగ్రెస్ మంత్రి చేతులమీదుగా దారిమళ్లాయన్నారు. వాల్మీకి స్కామ్‌లో ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మ హైదరాబాద్‌కు చెందిన బిల్డర్ అని, తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్ నేతలకు సత్యనారాయణ వర్మ అత్యంత సన్నిహితుడన్నారు.

మరో ట్వీట్‌లో తెలంగాణ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉపయోగించిన రూ.20 కోట్ల నగదు కాంగ్రెస్ కీలక నాయకుడి అనుచరుడిదే అని తేలిందని వాపోయారు. ఈ వ్యవహారానికి సంబంధించి లోతుగా విచారణ జరిపితే తెలంగాణ కాంగ్రెస్‌లోని పెద్ద నాయకుల పేర్లు బయటికి వస్తాయన్నారు.