calender_icon.png 11 May, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు కాలేశ్వరంలోనే ఉండాలి

09-05-2025 11:42:50 PM

పుష్కర ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్ రాహుల్ శర్మ

మహబూబాబాద్,(విజయక్రాంతి): సరస్వతీ పుష్కరాల నిర్వహణ కోసం శనివారం నుండి అధికారులు కాళేశ్వరంలో మకాం వేసి, అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ ఆదేశించారు. కాళేశ్వరం దేవస్థానం ఈఓ కార్యాలయంలో జిల్లా అధికారులతో పుష్కర పనుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని విభాగాలు  అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆరోగ్య శిభిరాల ఏర్పాట్లు, పారిశుద్ధ్య పనులు, సిబ్బందికి ఆహార ఏర్పాట్లపై  కేటాయించిన అధికారులు ప్రణాళిక ప్రకారం విధులు నిర్వహించాలన్నారు.

అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మూడు షిప్టు ల్లో విధులు నిర్వహించాలని, అత్యవసర మందులు, ఓఆర్ఎస్ పాకెట్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలకు మహాదేవపూర్ ఆసుపత్రి లో 30 బెడ్లు అందుబాటులో ఉంచాలన్నారు. 108 సేవలు అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు ఎక్కడ కూడా ఇలాంటి ఆటంకం కలగకుండా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వివిఐపి ఘాట్, గోదావరిలో నీటిమట్టం, టెంట్ సిటిని పరిశీలించారు. టెంట్ సిటీ వద్ద వర్షం వచ్చినా  భక్తులకు ఇబ్బంది లేకుండా అక్కడ బురద కాకుండా గ్రావెల్ వేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డిపిఓ వీర భద్రయ్య, పి ఆర్, ఆర్ అండ్ బి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.