30 May, 2026 | 7:06 PM

Breaking News

డంపు యార్డును తనిఖీ చేసిన కమీషనర్ ప్రఫుల్ దేశాయ్

30-05-2026 06:27 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుధ్య పనుల మెరుగులో భాగంగా శనివారం రోజు కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ నగరంలోని బైపాస్ రోడ్డులో గల  డంపు యార్డును ఇంజనీరింగ్, పారిశుధ్య విభాగం అధికారులతో కలిసి సందర్శించారు. వ్యర్థాల నిర్వహణ పనుల్లో భాగంగా డంపు యార్డులో పేరుకుపోయిన పాత వ్యర్థాలను తొలగింపులో యంత్రాల సహాయంతో కొనసాగుతున్న బయోమైనింగ్ ప్రక్రియను స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు.

ప్రస్తుతం ఈ ప్రక్రియ ఏ దశలో ఉంది ఎంత మేర వ్యర్థాలను బయోమైనింగ్ ద్వారా నిర్మూలించారనే వివరాలను ఇంజనీరింగ్, పారిశుధ్య విభాగాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. బయోమైనింగ్ పనులను మరింత వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్ట్ ప్రతినిధులను, అధికారులను ఆదేశించారు. అనంతరం  డంపు యార్డులో వ్యర్థాల వల్ల అంతర్గతంగా వాయువుల కారణంగా పలు చోట్ల మంటలను పొగను కమీషనర్ పరిశీలించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు, కాలనీ వాసులకు ఎలాంటి అబ్బందులు  కలగకుండా తక్షణమే పొగను అదుపు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. డంపు యార్డులో నిరంతరం పర్యవేక్షిస్తూ... ఫైర్ సేఫ్టీ చర్యలు పాటించాలని ఆదేశించారు.