26-06-2025 02:28:33 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ కమిషనర్(Bellampally Second Grade Municipality Commissioner) గా తన్నీరు రమేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు గురువారం మున్సిపాలిటీలోని తన చాంబర్లో ఆయన ఫైల్ పై సంతకం చేసి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఇక్కడ కమిషనర్ గా పనిచేసిన శ్రీనివాసరావు హెచ్డిఎంఏ కి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో భూపాలపల్లి మున్సిపాలిటీలో మేనేజర్ గా పని చేస్తున్న తన్నీరు రమేష్ కమిషనర్ గా పదోన్నతి పొంది బెల్లంపల్లికి బదిలీ అయ్యారు. ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన రమేష్ కు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చ అందజేసి స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా శాలువాకప్పి మర్యాదపూర్వకంగా సన్మానం చేసి తమను పరిచయం చేసుకున్నారు.