calender_icon.png 14 June, 2025 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమిటీలు లేక కాలయాపన?

13-06-2025 02:00:40 AM

  1. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూపు

లబ్ధిదారులకు శాపంగా పార్టీలో వర్గ పోరు

కరీంనగర్, జూన్12 (విజయక్రాంతి): కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ లో నెలకొన్న వర్గపోరు కారణంగా ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు లో జాప్యం జరిగి ఇందిరమ్మ ఇళ్ల మంజరి పత్రాలు లబ్ధిదారులకు అందకుండా పోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకాలలో ఇందిరమ్మ ఇళ్ల పథ కం ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున నిర్మించి పేద లకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ని యోజక వర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించి పనులు చేపడుతున్నా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం  ప్రారంభం కాలేదు. జిల్లా స్థాయిల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల పర్యవేక్షణలో లబ్ధిదారులను గ్రామ సభల్లో గుర్తించి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు.

ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమో దంతో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ పూర్తవుతుంది. జిల్లాలోని చొప్పదండి, హుజూరాబాద్, మానకొండూర్ నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి ఇళ్ల మం జూరు పత్రాలను లబ్ధిదారులకు అందించడంతో పాటు ఇళ్ల నిర్మాణ పనులు .కూడా జరుగుతున్నాయి. ఇటీవల కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రగతిని పేర్కొన్నారు.

జిల్లాలో 11,575 ఇళ్లను మంజూరు కేటాయించారని, ఫేజ్-1లో 2027, ఫేజ్-2లో 5,785 ఇండ్లకు మంజూరు ఇవ్వగా, మరో 3,763 ఇళ్ల మం జూరు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో జిల్లా రాష్ట్రం లో 8వ స్థానంలో ఉందని, కరీంనగర్ అసెం బ్లీ నియోజకవర్గ ఇందిరమ్మ కమిటీ ఏర్పా టు కాకపోవడంతో అక్కడ 3,270 ఇళ్ల మంజూరు ఇవ్వలేకపోయామని వాటి మం జూరు ఇస్తే జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంటుందని పేర్కొన్నారు.

అయితే ఈ విషయంలో జిల్లా ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి జిల్లా పరిధిలోని ఇద్ద రు మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ లు ఉన్నారుకుడాజిల్లా లో మొదటి ఫేజ్లో ఒక్కో మండలానికి ఒక్కో గ్రామానికి పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని కరీంనగర్ నియోజకవర్గంలో 230, చొప్పదండి నియోజకవర్గంలో 572, మానకొండూర్ నియోజకవర్గంలో 465, హుస్నాబాద్ నియోజకవర్గంలో 297, హుజూరాబాద్ నియోజకవర్గంలో 463 ఇళ్లను మంజూరు చేశారు.

మొత్తం 2,027 ఇళ్లు మంజూరు కాగా 975 ఇళ్లకు మార్క్ అవుట్ ఇచ్చారు. ఇప్పటి వరకు 380 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమై నాయి. రెండవ దశలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కి మంజూరు కూడ  కాలేదు. ఇద్దరు మంత్రులు  ఏకాభిప్రాయంబుతో కమిటీ కి పేర్లు ప్రతిపాదిస్తార లేక డబుల్  బెడ్ రూమ్ ఇళ్ల లాగా కలగానే మిగులుతయాచూడాలి.