15 March, 2026 | 9:23 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

18-07-2025 01:04 AM

మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

బెజ్జూర్, 17 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సోమిని, తలాయి, తిక్కపల్లి గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పర్యటించారు. వ్యవసాయం చేస్తున్న రైతుల పంట పొలాలు,పత్తి పంటలు అన్ని నీట మునగడంతో రైతులు దుఃఖ సాగరంలో మునిగి పోయారు.

ఈ ఏటా పంట చేతికి వస్తుందనే రైతుల ఆశలు అడియాసలు అయ్యాయి. గత 4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో పంట పొలాలు అన్ని నీట మునగడంతో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప  పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.