04-06-2025 08:45:46 PM
బెంగళూరు: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు విజయోత్సవం సందర్భంగా తొక్కిసలాటలో జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో మహిళలతో సహా 11 మంది మరణించిన సంఘటన చాలా దిగ్భ్రాంతికరమైనది. బెంగళూరు తొక్కిసలాటపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. తొక్కిసలాట ఘటనలో 11 మంది చనిపోయారని, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు.
స్టేడియం సామర్థ్యం 35 వేలు అయితే 2 లక్షల మందికి పైగా వచ్చారన్నారు. తొక్కిసలాట దురదృష్టకరమని, చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం సంతాపం తెలియజేశారు. ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశిస్తున్నామని, విచారణ కమిషన్ కు 15 రోజు గడువు విధించినట్లు ఆయన పేర్కొన్నారు. మృతుల్లో యువతే ఎక్కువగా ఉన్నారని కర్ణాటక సీఎం స్పష్టం చేశారు. స్టేడియం గేట్లు బద్ధలు కొట్టుకొని ఆర్సీబీ అభిమానులు దూసుకొచ్చారని సిద్ధరామయ్య వెల్లడించారు.